Big Breaking News : రాష్ట్రానికి రూ. 45,500 కోట్ల పెట్టుబడులు

by M.Rajitha |   ( Updated:2025-01-22 15:45:14.0  )
Big Breaking News : రాష్ట్రానికి రూ. 45,500 కోట్ల పెట్టుబడులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో మరో కంపెనీ భారీ పెట్టుబడి(Huge Investiment) పెట్టేందుకు ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దావోస్(Davos) పర్యటన ఫలితంగా.. రాష్ట్రంలో రూ. 45,500 కోట్ల అత్యంత భారీ పెట్టుబడి పెట్టేందుకు సన్ పెట్రో కెమికల్స్(Sun Petro Chemicals) సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంపెనీ అధికారులు ఎంవోయూ(MOU) కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సన్ సంస్థ భారీ పంప్డ్ స్టోరేజి పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ భారీ ప్రాజెక్టులు మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాలకు రానున్నాయి. కాగా ఈ ప్రాజెక్టుల వలన 7 వేల మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.

Next Story

Most Viewed