బహ్రెయిన్‌లో యువకుడి మృతి

by Shyam |
బహ్రెయిన్‌లో యువకుడి మృతి
X

దిశ, హుస్నాబాద్: బహ్రెయిన్‌ దేశంలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన సన్నపు మహేష్(23) రెండేళ్లక్రితం ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌ దేశానికి వెళ్లాడు. కాగా వారం రోజుల్లో తాను గ్రామానికి వస్తున్నాని మీకు ఏం తీసుకురావాలని తల్లిదండ్రులకు మహేశ్ ఆదివారం ఫోన్ చేశాడు. ఆదివారం సాయంత్రం అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రతుకు దెరువుకోసం రెండేళ్ళ క్రితం బయటి దేశానికి వెళ్లిన పెద్ద కొడుకు ఇంటికి వస్తున్నాడని సంతోషిస్తుండగా విషాద వార్త తెలియడంతో తల్లిదండ్రులు మల్లవ్వ, దేవయ్య కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed