అచ్చెన్నను హింసిస్తున్నారు: టీడీపీ నేతలు

by  |
అచ్చెన్నను హింసిస్తున్నారు: టీడీపీ నేతలు
X

దిశ, అమరావతి బ్యూరో: అక్రమ కేసులు పెట్టి అచ్చెన్నాయుడిని వైసీపీ ప్రభుత్వం హింసిస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. అచ్చెన్నను కలిసేందుకు సూపరింటెండెంట్ వారికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేతలు మీడియా మాట్లాడుతూ టీడీపీ వారిని అణగదొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ అంశం కేంద్ర పరిధిలోనిదని, ఎటువంటి సంబంధం లేకున్నా కావాలనే అచ్చెన్నాయుడును జగన్ సర్కార్ టార్గెట్ చేసిందని ఆరోపించారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో అచ్చెన్నను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని అచ్చెన్న తరపు న్యాయవాది, టీడీపీ నేతలు కోరారు.


Next Story

Most Viewed