ICC Test Rankings: సిరాజ్, యశస్వి జైశ్వాల్ ర్యాంక్‌లు మెరుగు

by Vinod kumar |
ICC Test Rankings: సిరాజ్, యశస్వి జైశ్వాల్ ర్యాంక్‌లు మెరుగు
X

న్యూఢిల్లీ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్, యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో భారత క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. శ్రీలంక క్రికెటర్ కరుణరత్నేతో కలిసి 9వ ర్యాంక్‌లో ఉన్నాడు. పంత్ ఒక్క స్థానాన్ని కోల్పోయి 12వ ర్యాంక్‌కు పడిపోగా.. కోహ్లీ 14వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 63వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

విండీస్‌తో తొలి టెస్టు సెంచరీతో సత్తాచాటిన అతను.. రెండో టెస్టులోనూ 57, 38 పరుగులతో రాణించాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 879 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ జడేజా ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 6వ ర్యాంక్‌కు చేరుకోగా.. పేస్ స్టార్ బుమ్రా 11వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. మరో పేసర్ మహ్మద్ సిరాజ్ 5 స్థానాలను వెనక్కినెట్టి 33వ ర్యాంక్‌లో నిలిచాడు. విండీస్‌తో రెండో టెస్టులో అతను ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed