WTC Final 2023: రెండోరోజు మొదలైన ఆట.. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ

by Vinod kumar |
WTC Final 2023: రెండోరోజు మొదలైన ఆట.. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట మొదలైంది. 3 వికెట్ల నష్టానికి 327 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించింది. స్టీవ్‌ స్మిత్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా స్మిత్‌ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.

తొలిరోజు టీమిండియా బౌలర్లు తేలిపోవడంతో ఆస్ట్రేలియా పూర్తి ఆదిపత్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ట్రెవిస్‌ హెడ్‌ 146 పరుగులు బ్యాటింగ్‌ సెంచరీ చేయగా.. స్టీవ్‌ స్మిత్‌ 95 పరుగులు బ్యాటింగ్‌ ఆడుతున్నారు. ఈ ఇద్దరు ఇ‍ప్పటికే 4 వికెట్‌కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు.

Advertisement

Next Story

Most Viewed