- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
దుబాయ్ లో మహిళల టీ20 వరల్డ్ కప్!
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ దుబాయ్ లో జరగనున్నట్టు క్రికెట్ వర్గాల సమాచారం. అక్టోబర్ 3 నుండి 20 వరకు జరగాల్సిన ఈ టోర్నీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా దుబాయ్ కి తరలనుందని సమాచారం. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని ఇప్పటి వరకూ వెలువరించక పోయినా.. తమ దేశంలో టోర్నీ నిర్వహించేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. అయితే అక్టోబర్ వరకు అల్లర్లు సద్దుమనుగుతాయని, తమకు మరికొంత సమయం కావాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కోరుతోంది. బంగ్లాదేశ్ అల్లర్ల మూలంగా ఈ టోర్నీ అక్కడ జరగడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడగా, ఈ టోర్నీ దుబాయ్ లో లేదా శ్రీలంకలో జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఐసీసీ సభ్యుడు ఒకరు మీడియాకు తెలిపారు. అయితే టోర్నీకి గడువు ముంచుకొస్తుండటం, బంగ్లాదేశ్ లో అల్లర్లు ఇంకా కొనసాగుతూ ఉండటంతో దుబాయ్.. ఈ టోర్నీ తాము నిర్వహిస్తామని ముందుకు వచ్చింది. ఇక ఐసీసీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.