భారత జట్టుపై వెంకటేశ్ ప్రసాద్ షాకింగ్ ట్వీట్స్..

by Vinod kumar |   ( Updated:2023-08-01 13:16:12.0  )
భారత జట్టుపై వెంకటేశ్ ప్రసాద్ షాకింగ్ ట్వీట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కొన్నాళ్లుగా సంచలన ట్విట్లతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిన భారత జట్టుపై మరోసారి తన స్టైల్‌లో ఫైర్ అయ్యాడు వెంకటేశ్ ప్రసాద్. ‘టెస్టు క్రికెట్‌‌ని పక్కనబెడితే, మిగిలిన రెండు ఫార్మాట్లలో టీమిండియా ఆటతీరు చాలా సాధారణంగా ఉందని టీమ్ ఇండియాపై ఫైర్ అయ్యారు. డబ్బుతో వచ్చిన అధికారంతో సర్వసాధారణ ఆటతీరును గొప్పగా చూపించుకుంటున్నా.. ఛాంపియన్‌ టీమ్‌కి ఉండాల్సిన లక్షణాలు.. మన టీమ్‌కి లేవు అని వెంకటేశ్ ప్రసాద్ షాకింగ్ ట్వీట్స్ చేశాడు.

వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయంతో క్రికెట్ ఫ్యాన్స్ ఏకీభవిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, రెండో వన్డేలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన టీమిండియా, సౌతాఫ్రికా టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది.

Twitter Link

Advertisement

Next Story

Most Viewed