IND vs WI 5th T20I: టాస్ గెలిచిన టీమిండియా..

by Vinod kumar |
IND vs WI 5th T20I: టాస్ గెలిచిన టీమిండియా..
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో విండీస్‌తో తలపడనుంది. వెస్టిండీస్ టూర్‌లో భాగంగా ఫ్లోరిడాలో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో వెస్టిండీస్ గెలవగా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. సిరీస్ 2-2 డ్రా కావడంతో నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు, సిరీస్ సొంతం చేసుకుంటుంది. నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే టీమిండియా యధాతథంగా కొనసాగించగా.. విండీస్‌ ఓ మార్పు చేసింది. ఒబెద్‌ మెక్‌కాయ్‌ స్థానంలో అల్జరీ జోసఫ్‌ బరిలోకి దిగాడు.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్‌ హోప్‌, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జేసన్‌ హోల్డర్‌, రోస్టన్‌ ఛేజ్‌, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్

భారత్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

Advertisement

Next Story

Most Viewed