క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆటగాడు!

by Vinod kumar |
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ఆటగాడు!
X

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ స్పిన్నర్ రాహుల్ శర్మ అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రాహుల్ శర్మ తన ట్విటర్‌ వేదికగా ఆదివారం ప్రకటించాడు. "నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, బీసీసీఐకు ధన్యవాదాలు" అని రాహుల్‌ ట్విట్‌ చేశాడు. అయితే బెల్ పాల్సి(ముఖ పక్షవాతం) సమస్యతో బాధపడ్డ రాహుల్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. రాహుల్‌ శర్మ 2011లో భారత తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శర్మ 4 వన్డేలు, 2 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. శర్మ 2010లో డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్) తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో శర్మ మొత్తం 44 మ్యాచ్‌లల్లో.. 40 వికెట్లు పడగొట్టాడు.



Advertisement

Next Story

Most Viewed