రెండో వన్డేలో ముగిసిన న్యూజిలాండ్ బ్యాటింగ్.. భారత్ ముందు భారీ స్కోర్

by Mahesh |
రెండో వన్డేలో ముగిసిన న్యూజిలాండ్ బ్యాటింగ్.. భారత్ ముందు భారీ స్కోర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత(India) మహిళలు, న్యూజిలాండ్(New Zealand) మహిళా జట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్(ODI series) జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో నవ్డే మ్యాచ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ స్టేడియం లో జరుగుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ చేయగా.. న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటార్లు మంచి ఆరంభాన్ని అందించారు. మధ్యలో కాస్త తడబడినప్పటికి.. మళ్లీ పుంజుకొని బ్యాటింగ్ చేశారు. నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 259 పరుగుల భారీ స్కోరు చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో సుజియా బ్యాట్స్ 58, జార్జియా ప్లిమ్మర్ 41, సోఫీ డివైన్ 79, మడ్డీ గ్రీన్ 42, మడ్డీ గ్రీన్ 12 పరుగులతో రాణించారు. కాగా ఈ మ్యాచులో భారత బౌలర్లలో రాధా యాదవ్ 4, దీప్తి శర్మ 2, ఠాకూర్, ప్రియ మిశ్రలు చెరో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 260 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

Next Story