గాయాలతో ఐపీఎల్ ఆడతారు.. జాతీయ జట్టుకు ఆడరు: క్రికెటర్లపై కపిల్ దేవ్ ఫైర్

by Harish |
గాయాలతో ఐపీఎల్ ఆడతారు.. జాతీయ జట్టుకు ఆడరు: క్రికెటర్లపై కపిల్ దేవ్ ఫైర్
X

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా క్రికెటర్లపై మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి ఫైర్ అయ్యాడు. ప్రస్తుత తరం క్రికెటర్లు డబ్బు, పొగరు, అహంతో అన్ని తమకే తెలుసని అనుకుంటున్నారని తీవ్రంగా స్పందించిన కపిల్ దేవ్.. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించాడు. ఐపీఎల్‌లో గాయాలతోనైనా ఆడతారని, జాతీయ జట్టుకు వచ్చేసరికి చిన్న చిన్న సాకులతో విశ్రాంతి తీసుకుంటారని వ్యాఖ్యానించాడు.

బుమ్రా గాయంతో జట్టుకు దూరమయ్యాడని, ప్రపంచకప్ నాటికి అతను కోలుకోక పోతే పరిస్థితి ఏంటని, అతనిపై సమయం వృథా చేసినట్టే అవుతుందని చెప్పాడు. ఐపీఎల్ గొప్పదేనని చెప్పిన కపిల్.. భారత టీ20 లీగే భారత ఆటగాళ్లను దెబ్బతీస్తుందని తెలిపాడు. ‘ఓపెన్‌గా చెబుతన్నా. చిన్నపాటి గాయాలతో మీరు ఐపీఎల్‌లో ఆడతారు. జాతీయ జట్టుకు మాత్రం ఆడరు. విశ్రాంతి తీసుకుంటారు.’ అని కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed