రఫ్పాడించిన రోడ్రిగ్స్.. బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా ఘన విజయం

by Vinod kumar |   ( Updated:2023-07-26 11:25:02.0  )
రఫ్పాడించిన రోడ్రిగ్స్.. బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్​షిప్‌లో భాగంగా టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్​1-1తో సమం అయ్యింది. బంగ్లాదేశ్‌పై రెండో వన్డేలో 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

అనంతరం బంగ్లాదేశ్​ జట్టును 120 పరుగులకే ఆలౌట్​ చేసింది. జెమిమా రోడ్రిగ్స్ తన ఆల్​రౌండ్ ప్రదర్శన (86 పరుగులు, 4 వికెట్లు)తో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించింది. దేవికా వైద్య 3, మేఘన సింగ్, దీప్తీ శర్మ, స్నేహ్​రానా తలో వికెట్​తీశారు. ఇక ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హర్మన్ సేన 1-1తో సమం చేసింది. శనివారం ఇరుజట్ల మధ్య సిరీస్ డిసైడర్ మూడో మ్యాచ్​ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed