IND vs WI: బీచ్‌లో వాలీబాల్‌ ఆడిన భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్‌

by Vinod kumar |
IND vs WI: బీచ్‌లో వాలీబాల్‌ ఆడిన భారత ఆటగాళ్లు.. వీడియో వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిం‍డీస్‌ టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు బ్యాచ్‌లుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాటు విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు విండీస్‌ గడ్డపై అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో విండీస్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు కరీబియన్‌ దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బీచ్‌ వాలీబాల్‌ సెషన్‌లో టీమిండియా ప్లేయర్స్‌ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఈ వీడియోలో విరాట్‌ కోహ్లి, అశ్విన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ వంటి ఆటగాళ్లు వాలీబాల్‌ ఆడుతూ కన్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక డొమినికా వేదికగా జూలై 12 నుంచి భారత్‌-విండీస్‌ మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు ముందు బార్బడోస్‌లో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 6న స్ధానిక జట్టుతో టీమిండియా తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement

Next Story

Most Viewed