క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించే న్యూస్.. మరోసారి ఫైనల్ పోరులో తలపడనున్న భారత్, పాక్..!

by Satheesh |   ( Updated:2024-07-26 13:42:46.0  )
క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఎక్కించే న్యూస్.. మరోసారి ఫైనల్ పోరులో తలపడనున్న భారత్, పాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దాయాది దేశాలు భారత్, పాక్ మ్యాచ్ అంటే క్రికెట్‌లో ఓ ఎమోషన్. చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయంటే క్రికెట్ ప్రియులు ఎన్ని పనులు ఉన్న పక్కన పెట్టి టీవీలు, స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతారు. భారత్, పాక్ మ్యాచ్ కోసం ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాకుండా ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల ఫ్యాన్స్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌లో భారత్, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌కే ఇదే నిదర్శనం. అందుకే పాక్, భారత్ ఎప్పుడు ఎప్పుడు తలపడతాయా అని ఆశగా ఎదురు చూస్తుంటారు అభిమానులు. అయితే అలాంటి వారికే ఓ గుడ్ న్యూస్.. ఎందుకంటే మరోసారి దాయాది దేశాలు ఫైనల్ పోరులో తలపడే అవకాశం ఉంది.

కానీ, ఇది పురుషుల జట్టు కాదు. టీమిండియా, పాక్ మహిళ జట్లు. ప్రస్తుతం శ్రీలంక వేదికగా మహిళల ఆసియా కప్ టోర్నీ జరుగుతోంది. ఇప్పటికే లీగ్ దశ ముగిసి ఈ టోర్నీ సెమీస్‌కు స్టేజ్‌కు వచ్చింది. ఈ టోర్నీలో భారత అమ్మాయిలు దుమ్మురేపారు. లీగ్‌లో ఓటమి ఎరగకుండా ఫైనల్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే, ఆదివారం సెమీస్-2లో భాగంగా అతిథ్య శ్రీలంక, పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, సెమీస్-2‌లో శ్రీలంకపై పాక్ గెలిస్తే ఇప్పటికే ఫైనల్ చేరిన భారత్‌తో దాయాది దేశం తలపడాల్సి ఉంటుంది. సో.. శ్రీలంకపై పాక్ గెలిచి ఫైనల్‌కు రావాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే జరిగితే మరోసారి దాయాదుల ఉత్కంఠ పోరు చూడవచ్చని ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed