- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND Vs ENG: దంచికొట్టిన గిల్, అయ్యర్.. నాగ్పూర్ వన్డేలో భారత్ ఘన విజయం

దిశ, వెబ్డెస్క్: మూడు వన్డేల సిరీస్లో భారత్ బోణి కొట్టింది. నాగ్పూర్ (Nagpur)వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India)4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) అర్ధశతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2, మహమ్మద్ 2, జోఫ్రా ఆర్చర్ 1, జాకబ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
కాగా, అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ 67 బంతుల్లో 54 పరుగులు, జాకబ్ బెతెల్ 64 బంతుల్లో 51 పరుగులు, సాల్ట్ 26 బంతుల్లో 43 పరుగులు, బెన్ డకెట్ 29 బంతుల్లో 32 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రాణా (Harshith Rana) 3, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 3, మహమ్మద్ షమీ (Mohammed Shami), అక్షర్ పటేల్ (Akshar Patel), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 249 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) కేవలం రెండు పరుగులు చేసి సిద్దిఖీ మహమ్మద్ (Siddiqui Mohammed) బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) దగ్గర పడుతోన్న వేళ అటు టెస్టుల్లో ఇటు వన్డేల్లో రోహిత్ వరుసగా విఫలం అవ్వడం టీమిండియా (Team India) అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashswi Jaiswal) 22 బంతుల్లో 15 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ (Shubhman Gill), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే అయ్యర్ హాఫ్ సెంచరీ (59) చేసి జాకబ్ బెతెల్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Akshar Patel), గిల్లో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే గిల్ (87) సాధిక్ మహమ్మద్ క్యాచ్ అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అక్షర్ పటేల్ (52) కూడా అదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో క్రీజ్లోకి వచ్చిన హర్దిక్ పాండ్య (9), రవీంద్ర జడేజా (12) పరుగులు చేసి భారత్ను విజయ తీరాలకు చేర్చారు.