- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బంగ్లాతో తొలి టెస్టులో పట్టు బిగించిన టీమ్ఇండియా
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆటలో తొలి అర్థభాగంలో భారత బ్యాటర్లు శుభ్మన్ గిల్ (119* పరుగులు), రిషభ్ పంత్ (109 పరుగులు) శతకాలతో అదరగొట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 287-4 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత కలుపుకుని 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ముందుంచింది. భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 158 పరుగులకు 4వికెట్లు కోల్పోయింది. క్రీజులో నజ్ముల్ షాంటో (51 పరుగులు), షకిబ్ అల్ హసన్ (5 పరుగులు) ఉన్నారు. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 3, పేసర్ జస్ర్పీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే బంగ్లా మరో 356 పరుగులు సాధించాల్సి ఉంది. అయితే భారత బౌలర్ల జోరు ముందు బంగ్లాకు లక్ష్య చేధన అంత సులభం కాదంటున్నారు క్రీడా విశ్లేషకులు.