బంగ్లాతో తొలి టెస్టులో పట్టు బిగించిన టీమ్ఇండియా

by Y. Venkata Narasimha Reddy |
బంగ్లాతో తొలి టెస్టులో పట్టు బిగించిన టీమ్ఇండియా
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆటలో తొలి అర్థభాగంలో భారత బ్యాటర్లు శుభ్​మన్ గిల్ (119* పరుగులు), రిషభ్ పంత్ (109 పరుగులు) శతకాలతో అదరగొట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 287-4 పరుగులకు ఇన్నింగ్స్​ డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత కలుపుకుని 515 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ముందుంచింది. భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసరికి 158 పరుగులకు 4వికెట్లు కోల్పోయింది. క్రీజులో నజ్ముల్ షాంటో (51 పరుగులు), షకిబ్ అల్ హసన్ (5 పరుగులు) ఉన్నారు. స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 3, పేసర్ జస్ర్పీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ గెలవాలంటే బంగ్లా మరో 356 పరుగులు సాధించాల్సి ఉంది. అయితే భారత బౌలర్ల జోరు ముందు బంగ్లాకు లక్ష్య చేధన అంత సులభం కాదంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Next Story

Most Viewed