తదుపరి మ్యాచ్‌లకు పూర్తిగా సిద్ధమయ్యాం : భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్

by Vinod kumar |
తదుపరి మ్యాచ్‌లకు పూర్తిగా సిద్ధమయ్యాం : భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్
X

లండన్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీ ఇంగ్లాండ్‌లో విజయవంతంగా కొనసాగుతోంది.. ఈ వారంతంలో జరిగే మ్యాచ్‌లకు పూర్తిగా సన్నద్ధమయ్యామని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అన్నాడు. లండన్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో భారత జట్టు పాల్గొనింది. భారత జట్టు కోసం లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన విందులో జట్టు సభ్యులతో పాటు హర్మన్‌ప్రీత్, కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ కూడా పాల్గొన్నారు.

శుక్రవారం బెల్జియంతో, శనివారం గ్రేట్ బ్రిటన్‌తో భారత జట్టు ఆడనుంది. ‘చాలా సంవత్సరాల తర్వాత లండన్‌కు రావడం సంతోషంగా ఉంది. గతంలో అంటే 2017లో ఇక్కడికి వచ్చాం. ప్రొ లీగ్ మ్యాచ్‌లు సజావుగా సాగుతున్నాయి. జూన్ 2, 3 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు మేము పూర్తిగా సిద్ధపడ్డాం. అందరూ స్టేడియానికి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను’ అని హర్మన్‌ప్రీత్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed