IND VS SL : భారత్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్

by Harish |
IND VS SL : భారత్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరా గాయం సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు బుధవారం వెల్లడించింది. ‘చమీరా బ్రోన్కైటిస్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే, అతను టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు.’ అని తెలిపింది. చమీరా స్థానంలో మరో పేసర్ అసిత ఫెర్నాండో‌ను జట్టులోకి తీసుకున్నట్టు పేర్కొంది. చమీరా భారత్‌తో వన్డేలకు కూడా దూరం కానున్నట్టు చీఫ్ సెలెక్టర్ ఉపుల్ తరంగా వెల్లడించాడు. వన్డేలకు ఇంకా శ్రీలంక జట్టును ప్రకటించలేదు. మరోవైపు, 2022‌లో టీ20ల్లోకి అడుగుపెట్టిన అసిత ఫెర్నాండో అదే ఏడాదిపై భారత్‌పై చివరి పొట్టి మ్యాచ్ ఆడాడు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి శ్రీలంక తరపున టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు.



Next Story