- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
చాహల్కు ఛాన్స్ ఇవ్వని బీసీసీఐ.. భార్య ధనుశ్రీ ఇన్స్టా స్టోరీ వైరల్!
దిశ, వెబ్డెస్క్: ఆసియా కప్ ఆడే జట్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కలేదు. జట్టులో ఒకే రిస్ట్ స్పిన్నర్ను తీసుకునే అవకాశం ఉందని.. ఈ కారణంగానే చాహల్ను తీసుకోలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. దీనిపై చాలా మంది మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. చాహల్ చాలా కీలకమైన స్పిన్నర్ అని, అతన్ని జట్టులోకి తీసుకోవాల్సిందని పలువురు చెప్పారు. హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్.. తదితరులు తామైతే కచ్చితంగా చాహల్ను తీసుకునే వాళ్లమని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో చాహల్ భార్య ధనశ్రీ తన ఇన్స్టా స్టోరీలో పంచుకున్న పోస్టు వైరల్ అవుతోంది. తన భర్తకు ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై డైరెక్టుగా ఆమె ఎలాంటి కామెంట్ చేయకపోయినా.. ఈ పోస్టు మాత్రం దాని గురించే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
'చెప్పినట్లు వింటూ ఇంట్రావర్ట్లా ఉంటే మన కెరీర్ ఎదుగుదలకు నష్టం జరుగుతుందా..? లేదంటే మనందరం కూడా ఎక్స్ట్రావర్టుల్లా మారిపోయి, మాటకారి తనంతో జీవితంలో ఎదగడం నేర్చుకోవాలా? అని చాలా సీరియస్గా ఆలోచించడ మొదలు పెట్టా' అని ఆమె పోస్టు పెట్టింది. ధనశ్రీ ఇలా పోస్టు పెట్టడం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఆమె మాటకారితనంతో బతకడం గురించి చెప్పడాన్ని కూడా ఫ్యాన్స్ రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ టీంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సహా ఆరుగురు ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లే ఉన్నారు. దీనిపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్కు ధనశ్రీ కామెంట్స్ మరింత అసహనం పెంచుతున్నాయి.