ఉచిత ప్రయాణమే ఊపిరి తీసింది

by Sridhar Babu |   ( Updated:2024-10-17 15:03:06.0  )
ఉచిత ప్రయాణమే ఊపిరి తీసింది
X

దిశ,చింతలమానేపల్లి : ఉచిత ప్రయాణమే వ్యక్తి ఊపిరి తీసింది. బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చింతలమానేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన రామటెంకి శంకర్(45) భార్య తన కుమారుడిని జైపూర్ హాస్టల్​కు తీసుకెళ్తుంది.

కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణంలో చూపించాల్సిన ఆధార్ కార్డు ఇంట్లోనే మర్చిపోయింది. ఫోన్​ చేసి ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పింది. దాంతో శంకర్ బైక్ పై దానిని తీసుకొస్తున్న క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోనే చనిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

Advertisement

Next Story