Asian Games 2023: భారత్​ ఖాతాలోకి మరో రెండు పతకాలు..

by Vinod kumar |   ( Updated:2023-10-05 15:49:01.0  )
Asian Games 2023: భారత్​ ఖాతాలోకి మరో రెండు పతకాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్​ఖాతాలోకి మరో రెండు పతకాలు చేరాయి. రెజ్లింగ్‌లో కాంస్యం, పరుగు పందెంలో సిల్వర్ పతకాలు వచ్చాయి. భారత రెజ్లర్ సునీల్ కుమార్ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే మహిళల 800 మీటర్ల పరుగు పందెంలో భారత్‌కు చెందిన హర్మిలన్ బెయిన్స్ రజత పతకం సాధించింది. ఈ ఏడాది ఏషియన్‌ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 71 చేరింది. తద్వారా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌ అత్యధిక పతకాలు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2018 ఆసియా క్రీడల్లో 70 పతకాలను ఇండియా సాధించింది. కాగా ప్రస్తుతం భారత ఖాతాలో 16 స్వర్ణాలు, 27 రజతాలు, 30 కాంస్య పతకాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed