Asia Cup 2023: మళ్లీ వర్షం అంతరాయం.. మ్యాచ్‌ రద్దయితే?

by Vinod kumar |   ( Updated:2023-09-04 15:23:44.0  )
Asia Cup 2023: మళ్లీ వర్షం అంతరాయం.. మ్యాచ్‌ రద్దయితే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా నేపాల్, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ ఇన్నింగ్స్‌లో 2.1 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గితే మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఒకవేళ వర్షం ఇలానే కొనసాగితే మ్యాచ్‌ రద్దవుతుంది. అప్పుడు రెండు పాయింట్లతో భారత్ సూపర్-4కు వెళ్తుంది. ప్రస్తుతం భారత్ స్కోరు 17/0. రోహిత్ శర్మ (4), శుభ్‌మన్ గిల్ (12) పరుగులతో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed