Ashes 2023: మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ఇదే.. సీనియర్‌ బౌలర్‌పై వేటు..

by Vinod kumar |   ( Updated:2023-07-07 14:32:22.0  )
Ashes 2023: మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ఇదే.. సీనియర్‌ బౌలర్‌పై వేటు..
X

దిశ, వెబ్‌డెస్క్: లీడ్స్‌ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తుది జట్టును ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే తొలి రెండు టెస్టుల్లో వికెట్లు తీయడంలో విఫలమైన సీనియర్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌పై వేటు పడింది. యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్‌.. ఎలాగైనా మూడో టెస్టులో గెలవాలన్న పట్టుదలతో ఉంది. అండర్సన్‌తో పాటు రెండో టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన జోష్‌ టంగ్‌ను కూడా పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించింది.

వీరిద్దరి స్థానాల్లో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌తో పాటు మార్క్‌ వుడ్‌లు తుది జట్టులోకి వచ్చారు. భుజం గాయంతో సిరీస్‌కు దూరమైన బ్యాటర్‌ ఓలీ పోప్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం ఇంగ్లండ్‌ గడ్డపై 22 ఏళ్ల తర్వాత యాషెస్‌ సిరీస్‌ను గెలిచిన కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌ చరిత్ర సృష్టించనున్నాడు.

మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్

Advertisement

Next Story

Most Viewed