కొవిడ్‌పై పోరాటం.. రూ. కోటి విరాళమిచ్చిన సౌందర్య రజినీకాంత్

by vinod kumar |   ( Updated:2021-05-15 01:06:49.0  )
కొవిడ్‌పై పోరాటం.. రూ. కోటి విరాళమిచ్చిన సౌందర్య రజినీకాంత్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా తో దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారు. వీరికోసం సెలబ్రెటీలు తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కరోనా తో బాధపడుతున్నవారికి అండగా నిలుస్తూ విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటీకే పలువురు ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్ కి వీరులను అందజేశారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ తన వంతు సాయంగా రూ. కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా అందజేసింది. సౌందర్య,ఆమె భర్త విశాగన్‌ వనంగముడి, మామ ఎస్‌ఎస్‌ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. కరోనా ను అందరం కలిసి తరిమి కొడదామని, దైర్యంగా ఎదుర్కొందామని సౌందర్య రజినీకాంత్ తెలిపారు. ఇక ఇటీవలే తమిళ్ హీరోలు సూర్య, అజిత్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌, హీరో ఉదయనిధి స్టాలిన్‌ లు సైతం తమ వంతు సాయంగా విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. ఆపద సమయంలో హీరోలు చేస్తున్న ఈ మంచి పనులను అందరు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed