హమ్మయ్యా.. స్పాన్సర్లు దొరికారు

by  |
హమ్మయ్యా.. స్పాన్సర్లు దొరికారు
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కష్ట కాలంలో క్రీడాలోకం స్తంభించింది. లైవ్ స్పోర్ట్స్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి ద్వైపాక్షిక సిరీస్ జరుగనున్నది. జూలై 8 నుంచి జరుగనున్న తొలి టెస్టు చరిత్రపుటల్లోకి ఎక్కనుంది. అయితే, కొవిడ్-19 కారణంగా అన్ని సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యాడ్స్‌పై రూ. కోట్లు ఖర్చుపెట్టడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న విండీస్, ఇంగ్లండ్ సిరీస్‌కు ఎవరైనా స్పాన్సర్లు దొరుకుతారా అనే అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ సిరీస్‌ను ఇండియాలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తున్నది. తాజాగా సోనీ సంస్థ ఎనిమిది మంది స్పాన్సర్లను వెతికి పట్టుకుంది. స్కోడా, మై 11 సర్కిల్, ఎంగేజ్ డియోడరెంట్ బ్రాండ్లు ఈ సిరీస్ కో-ప్రెజెంటర్లుగా వ్యవహరించనుండగా బైజూస్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, మొబైల్ ప్రీమియర్ లీగ్, డఫా న్యూస్‌లు అసోసియేట్ స్పాన్సర్లుగా వ్యవహరించడానికి ముందుకు వచ్చాయి. ఒక్కో యాడ్ క్యాటగిరీని బట్టి రూ.35లక్షలు, రూ.20లక్షలకే సోనీ సంస్థ అమ్మేసింది. ఈ సిరీస్ నుంచి తాము గట్టెక్కినట్లే అని సోనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed