తాజా పండ్లు, కూరగాయాలు తినండి

by  |
తాజా పండ్లు, కూరగాయాలు తినండి
X

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలు విటమిన్-సిని అందించే పండ్లు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. విటమిన్- సి పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ మేరకు జిల్లా వాసులకు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా నుంచి బత్తాయిలను తెప్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు టన్నుల మోసంబిలు అందుబాటులో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు.

tag; sircilla collector, vitamin-c, ts news


Next Story

Most Viewed