ఖమ్మంలో పలువురు ఎంపీవోలు బదిలీ..

by Anukaran |
ఖమ్మంలో పలువురు ఎంపీవోలు బదిలీ..
X

దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలో పలువురు ఎంపీవోలను జిల్లా కలెక్టర్​ఆర్‌వీ కర్ణన్​బదిలీ చేస్తూ బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. రూరల్​మండల పరిషత్​ఎంపీవోగా పనిచేస్తున్న టీవీఎల్​ఎన్ శాస్త్రీని సింగరేణి మండలానికి, కూసుమంచి మండల ఎంపీవోగా పనిచేస్తున్న జేఎల్​జీ గాంధీని ఖమ్మం రూరల్​ఎంపీవోగా, సింగరేణి మండల ఎంపీవోగా పనిచేస్తున్న ఎంపీవో ఎమ్​. రాంచందర్​రావును కూసుమంచి మండల ఎంపీవోగా బదిలీ చేస్తూ కలెక్టర్​ఉత్వర్వులను జారీ చేశారు. అదే విధంగా ఇటీవల సస్పెన్షన్​కు గురైన ఎన్కురూ ఎంపీవోగా పనిచేస్తున్న పీ. వీరస్వామికి కూడ కల్లూరు ఎంపీవోగా పోస్టింగ్​ఇచ్చినట్లు డీపీవో వాసిరెడ్డి ప్రభాకర్​రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed