ఐదు నెలల తర్వాత మోగనున్న బడిగంట..

by  |
ఐదు నెలల తర్వాత మోగనున్న బడిగంట..
X

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు అన్ని మూతబడ్డాయి. అయితే, తెలంగాణలో గత ఐదు నెలలుగా మూతబడిన పాఠశాలలు గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయులు మాత్రమే బడికి వెళ్లనుండగా, కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చే వరకూ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతి లేదు. ఉపాధ్యాయులు మాత్రం బడికి వెళ్లి అక్కడి నుంచి డిజిటల్ పాఠాలు బోధించనున్నారు.

ఇదిలాఉండగా, ప్రస్తుతం కొన్ని పట్టణాలు, గ్రామాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో పాఠశాలలకు ఎలా వెళ్లాలనే దానిపై మహిళా టీచర్లు, ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed