వాహన కొనుగోలు దారులకు శుభవార్త.. ఇకపై ఆన్-స్పాట్‌‌లో RC..

by Shamantha N |   ( Updated:2021-12-15 06:37:22.0  )
rc
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త వాహనాలు కొన్న యజమానులు, ఇకపై నెలలు తరబడి బండి RC కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీవో ఆఫీస్‌ల చుట్టూ తిరగనవసరం లేదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. ఇకపై బండి కొన్న వెంటనే అదే డీలర్ ఆన్-స్పాట్‌లో ఆర్‌సీ కార్డ్‌ను జారీ చేయనున్నారు. అంతేకాకుండా డీలర్ పాయింట్‌లో ఆర్‌సీ ప్రింటింగ్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేయరు. రాష్ట్ర ప్రభుత్వం కార్డ్ లను జారీ చేసే అధికారం కొంత మంది డీలర్లకు ఇచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను మార్చిలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే 1.44 లక్షల ఆర్‌సీలు జారీ చేశామని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed