ఎంజీఎం ఆస్పత్రిలో టెన్షన్.. టెన్షన్

by  |
ఎంజీఎం ఆస్పత్రిలో టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పరిస్థితి అధ్వానంగా మారింది. గతరాత్రి కురిసిన వర్షం నీరు ఆస్పత్రిలోకి చేరుకుంది. ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డంతా కూడా వర్షం నీరుతో నిండిపోయింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

కాగా కొన్ని రోజుల నుంచి ఎంజీఎంపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారులెవరూ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పట్టించుకుని ఈ పరిస్థితి చక్కదిద్దాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed