హస్తినకు వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ

by  |
హస్తినకు వైఎస్సార్సీపీ రెబెల్ ఎంపీ
X

దిశ, ఏపీ బ్యూరో: గత కొంత కాలంగా వైఎస్సార్సీపీలో రాజకీయ కలకలం రేపుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీకి పయనమయ్యారు. క్రమశిక్షణా రాహిత్యంతో మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ వైఎస్సార్సీపీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, పార్టీ ఉనికినే ప్రశ్నిస్తూ లేఖరాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీతా వెళ్లనున్నారు. ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, అధికార పార్టీ తీరుతో ప్రాణహాని ఉందని, తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరనున్నారు. ఇదివరకు స్పీకర్‌కు రాసిన లేఖను ఆయన హొం శాఖకు పంపిన విషయం విదితమే.. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోం శాఖా మంత్రిని కలిసి పరిస్థితులు వివరించనున్నారు.


Next Story

Most Viewed