AP Politics: ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు..చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

by Indraja |
AP Politics: ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు..చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: కాంగ్రెస్​ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్​ యాధృచ్చికంగా బీజేపీ మీద విమర్శలు చేశారా.. లేక నిజంగానే బీజేపీ ఒక్క సీటు గెలవలేదా అనే చర్చ తెరమీదకు వచ్చింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ మొత్తం ఆరు ఎంపీ, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. వాస్తవంగా ఆ పార్టీ బలానికీ, పోటీ చేసిన సీట్లకూ పొంతన లేదు.

టీడీపీ, జనసేన ఓట్లు ఏ మేరకు బీజేపీ అభ్యర్థులకు బదిలీ అయ్యాయనే అంచనా మేరకు చింతా మోహన్ అలా​ వ్యాఖ్యానించి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

బీజేపీకి వారు ఓటు వేశారా..

ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ, అమిత్​ షాతో సీఎం జగన్ భేటీ అనంతరమే రాష్ట్రంలో బీజేపీ పొత్తును కుదుర్చుకుంది. వాళ్ల మధ్య జరిగిన చర్చను బట్టే బీజేపీ ఎక్కువ స్థానాలను డిమాండ్​ చేసినట్లు నాడు అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందనే ప్రచారంతో తమ్ముళ్లు చాలా ఉక్రోషంతో ఉన్నారు.

అందువల్ల కూటమిలో బలమైన టీడీపీ శ్రేణులు బీజేపీకి చిత్తశుద్దితో ఓట్లు వేయించారా లేదా అనే అనుమానాలున్నాయి. బీజేపీ పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలుస్తుందనే దానిపై చింతా మోహన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

కూటమి నేతలతో నేడు బాబు చర్చలు..

సీఎం జగన్​ శుక్రవారం విదేశాల నుంచి రాష్ట్రానికి రానున్నారు. ఆయన లండన్‌లో బయల్దేరుతూనే మళ్లీ అధికారానికి వస్తున్నామని ట్వీట్ చేశారు. పోలింగ్​ సరళిని బట్టి వైసీపీకి 35 స్థానాలకు మించి రాకపోవచ్చంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మొట్టమొదటి సారి నోరు విప్పారు. నేడు ఆయన పవన్​, బీజేపీ నేతలతో చర్చించనున్నారు.

పోలింగ్ జరిగిన తీరును బట్టి ఎన్ని స్థానాలు రావొచ్చనే దానిపై లోతుగా పరిశీలించనున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ ఒక్క సీటు గెలవడం కష్టమని చింతా వ్యాఖ్యానించడం.. ఆ పార్టీ సీట్లన్నీ వైసీపీ కైవసం చేసుకుంటుంది కాబట్టి తామే గెలుస్తామని జగన్​ ట్వీట్ చేయడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed