దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్టు

by  |
దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్టు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో వ్యాపారిపై దాడి చేసి నగదు బ్యాక్ లాక్కెళ్లిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 4న కోఠిలో రాత్రి 9గంటలకు ఓ ఫార్మసీ యజమాని షాపును మూసి బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో పుత్లిబౌలి అమృతబార్ దగ్గర పక్కా ప్లాన్‌తో దాడి చేసిన దుండగులు నగదు బ్యాగ్‌ను లాక్కెళ్లారు. ఈ దాడిలో షాపు యజమానికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చేరాడు. బ్యాగులో రూ.3.30లక్షలు ఉన్నట్టు అప్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి రూ.2.60లక్షల నగదు, రెండు బైక్‌లు, రెండు కత్తులు, 6 సెల్‌ఫోన్లు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed