- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు సంచారం కొనసాగుతోంది. మంగళవారం నిఘా వర్గాల సమాచారంతో వెంటనే అప్రమత్తమైన ఏపీ పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం కుంబింగ్ కొనసాగిస్తున్నారు. భారీగా వర్షం పడుతున్నా… వెనక్కి తగ్గకుండా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాడేరు, ముంచంగిపుట్టు, పెదబయలులో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకుని మావోయిస్టు నేత మైలారపు అడెళ్లు అలియాస్ బాస్కర్ కోసం వేట ముమ్మరమైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో డ్రోన్ల సాయంతో మావోయిస్టు నేత కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఉత్తర తెలంగాణ సరిహద్దు మొదలు మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. గ్రౌండ్ లెవెల్లో గ్రేహౌండ్స్ పోలీసులు.. మహారాష్ట్ర సరిహద్దుకు అటువైపు సీఆర్పీఎఫ్ జవాన్లు అడెళ్ళు అలియాస్ భాస్కర్ కోసం వేట కొనసాగిస్తున్నారు.