పెట్రోల్@ రూ.101 నాటౌట్..!

by Harish |
petrol
X

దిశ, వెబ్‌డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పోటిపడి పెరుగుతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా 12 వ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడంతో దేశీయ ఇంధన ధరలు దేశవ్యాప్తంగా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 31 పైసలు, డీజిల్ ధర లీటరుకు 33 పైసలు పెరిగింది.

దీంతో ఢిల్లీలో పెట్రోల్‌కు లీటరు ధర రూ.90.58, డీజిల్ రూ.80.97 చేరింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో పెట్రోల్ లీటరుకు రూ.101లకు చేరి దేశంలో ఆల్ టైం రికార్డ్ సాధించింది. డీజిల్ సైతం రూ.93.23 లకు చేరుకుంది. మధ్యప్రదేశ్ అనుప్పూర్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.101 చేరుకోగా, డీజిల్ లీటరుకు. 91.43 వద్ద రిటైల్ అవుతోంది. గత 12 రోజుల్లో, పెట్రోల్ రేటు లీటరుకు రూ.3.64, డీజిల్ రేటు లీటరుకు రూ.4.18 పెరిగింది. హైదరాబాద్‌ లో పెట్రోల్ రూ.94.18, డీజిల్ రూ.88.31 ధర కొనసాగుతోంది.

Next Story

Most Viewed