ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదంపై పవన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
pawan-kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల జలవివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఇద్దరు సీఎంలు చాలా సఖ్యతగా ఉంటున్నామని ప్రకటించారని, అయితే వివాదాలు ఎందుకు వస్తున్నాయని పవన్ ప్రశ్నించారు. ఈ వివాదం రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా ఉందన్నారు. నిరుద్యోగ యువత కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని పవన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed