Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చిన స్టార్ హీరోయిన్ సినిమా ‘రఘుతాత’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

by Hamsa |
Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చిన స్టార్ హీరోయిన్ సినిమా ‘రఘుతాత’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
X

దిశ, సినిమా: కథానాయిక కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘుతాత'. సుమన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని హోంబళే ఫిల్మ్‌ సంస్థ నిర్మించింది. విజయ్‌ కిరగందూర్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల తమిళ, కన్నడ భాషల్లో థియేటర్‌లో ఈ చిత్రం విడుదలైంది. కాగా ఈ చిత్రం ఈ నెల 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 'రఘు తాత' ఓటీటీలోకి రానుంది. ఈ నేపథ్యంలో కీర్తిసురేష్‌ మాట్లాడుతూ 'నమ్మిన దాని కోసం నిలబడే ధైర్యశాలి పాత్రను ఈ చిత్రంలో పోషించాను. ఆ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని నటించాను. ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ చిత్రం అందరికి చేరువ అవుతుండటం సంతోషంగా వుంది' అన్నారు. దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ సినిమా మా జీవితంలో ఓ మరుపురాని జర్నీగా నిలుస్తుంది. యూనివర్శల్‌ పాయింట్‌తో రూపొందిన ఈ చిత్రం భాషా, ప్రాంతం అన్న తేడా లేకుండా అందరినీ అలరించగలిగింది. ఇక ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్‌తో ఈ చిత్రం అందరి మనసులు గెలుచుకుంటుంది' అన్నారు.

Advertisement

Next Story

Most Viewed