గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒకరు మృతి

by srinivas |
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒకరు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట హైవేపై వేదాంతపురం సర్కిల్ వద్ద ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం వైపు నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్లగ్:
Tags:

Advertisement

Next Story