CM Revanth Reddy: బుల్డోజర్ల కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు

by Prasad Jukanti |   ( Updated:2024-10-22 10:25:36.0  )
CM Revanth Reddy:  బుల్డోజర్ల కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లను బుల్డోజర్లతో తొక్కిస్తానని హెచ్చరించారని పేర్కొంటూ సీఎంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీశ్ రావును బెదిరిస్తూ, హింసను ప్రేరేపిస్తూ భయాందోళనకు గురి చేసేలా సీఎం వ్యాఖ్యలు చేశారని అందువల్ల ముఖ్యమంత్రిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. గత మార్చి 6వ తేదీన పాలమూరు ప్రజా దీవెన సభలోనూ సీఎం మాట్లాడుతూ 'అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడ్నానా మిగులుతే నేను చస్తా, ఒక్కొక్కడిని పండపెట్టి తొక్కిపేగులు తీసి మెడలో వేసుకుని తిరుగుతా' అన్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన యూట్యూబ్ లింకులను తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. సీఎం మాటలు చూస్తుంటే తమ పార్టీ నాయకుల భద్రతపై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆందోళన కలుగుతున్నదని అందువల్ల సీఎంపై చట్టప్రకారం చర్యలు తీసోకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలపై జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed