- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి..
దిశ, ములుగు : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ములుగు మండలం ప్రేమ్ నగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ములుగు ఎస్సై ఫణి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ నగర్ గ్రామానికి చెందిన లెంకలపెల్లి రవి (52) ములుగు సివిల్ సప్లై గోదాంలో హమాలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం పని నిమిత్తం సివిల్ సప్లై జిల్లా కార్యాలయానికి వెళ్లి ప్రేమ్ నగర్కు తిరిగి వెళుతున్నాడు.
ఈ క్రమంలో 163 జాతీయ రహదారి ప్రేమ్ నగర్ సమీపాన డివైడర్ దాటుతున్న క్రమంలో హన్మకొండ వైపు నుండి ములుగు కు వస్తున్న పోరిక సుశాంత్ ద్విచక్రవాహనం వేగంగా రవి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రవి తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు రవిని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా సుశాంత్ కు తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుని కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.