ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వృద్ధురాలు మృతి

by  |
ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వృద్ధురాలు మృతి
X

దిశ, సూర్యాపేట: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపాన ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మంగళవారం ఉదయం సమయంలో బైరోజు సారమ్మ అనే 62 ఏళ్ల వృద్ధురాలు ఫుట్ పాత్ పై అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. వృద్ధురాలిది తుంగతుర్తి నియోజకవర్గంలోని బండ రామారం గ్రామంగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.


Next Story

Most Viewed