88 ఏళ్ల వృద్ధురాలు ఎలా చెరువులో పడింది..?

by  |
88 ఏళ్ల వృద్ధురాలు ఎలా చెరువులో పడింది..?
X

దిశ, కోదాడ: మున్సిపాలిటీ పరిధిలోని చెరువు బజార్‌లో విషాదం చోటుచేసుకుంది. 88 ఏళ్ల వృద్ధురాలు స్థానిక చెరువులో పడి మృతి చెందింది. చల్ల కాంతమ్మ అనే వృద్ధురాలు ఇటీవల అనారోగ్యం పాలైంది. ఎప్పటిలాగే శనివారం కూడా భోజనం చేసి ఇంట్లోనే ఉందనుకున్నారు చుట్టుపక్కల వారు. అయితే ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా కాంతమ్మ లేదు. దీంతో స్థానికులు వెతకటం ప్రారంభించారు. ఇంతలోనే చెరువులో మృతదేహాం కనబడంతో బయటకు తీయగా వృద్ధురాలు కాంతమ్మదిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed