రామాలయం నిర్మిస్తే కరోనా తగ్గుతుంది : శరద్ పవార్

by  |
రామాలయం నిర్మిస్తే కరోనా తగ్గుతుంది : శరద్ పవార్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో, అయోధ్య రామమందిరం నిర్మాణంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిరం నిర్మాణం జరిగితే దేశంలో కరోనా వైరస్ తగ్గుతుందని కొందరు భావిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం శరద్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పవార్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని, పవార్ వ్యాఖ్యలు ప్రధాని మోడీకి వ్యతిరేకం కాదని, రాముడికి వ్యతిరేకంగా ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమా భారతి పేర్కొన్నారు.


Next Story

Most Viewed