కన్నీళ్ళు తెప్పిస్తున్న బెంగాల్ వైద్యురాలి తల్లి మాటలు

by M.Rajitha |
కన్నీళ్ళు తెప్పిస్తున్న బెంగాల్ వైద్యురాలి తల్లి మాటలు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై ఆమె తల్లి మీడియాతో మాట్లాడారు. తన బిడ్డకు జరిగిన ఘోరం మరెవరికీ జరగకూడదని కన్నీటి పర్యంతం అయ్యారు. ముందురోజు రాత్రి తమతో సంతోషంగా మాట్లాడిందన్నారు. ఉదయం 10 గంటలకు కాలేజీ నుండి ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చారు. మేము వెంటనే ఇక్కడికి వచ్చినప్పటికీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదన్నారు. మేము గొడవ చేయడంతో మధ్యాహ్నం 3 గణతల తర్వాత లోపలికి పంపించారని.. ఒళ్ళంతా గాయాలు, కంట్లో, నోట్లో రక్తంతో, సరిగా దుస్తులు కూడా లేకుండా దయనీయ స్థితిలో తమ కూతురు మృతదేహం పడి ఉందన్నారు. ఏ కూతురుకు ఇలాంటి దారుణం జరగకూడదు అని మీడియా ముందు రోదించారు. ఆరోజే అది ఆత్మహత్య కాదని, హత్య అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొద్ది రోజుల్లో డాక్టర్ పట్టాతో ఇంటికి వస్తుంది అనుకుంటే ఇలా శవాన్ని మా చేతుల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితునికి ఉరిశిక్ష విధించాలని ఆమె ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed