"పాపులర్ కావడానికే అతిక్, అష్రఫ్‌లను చంపాలనుకున్నాం"

by Mahesh |
పాపులర్ కావడానికే అతిక్, అష్రఫ్‌లను చంపాలనుకున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టుల వలే వచ్చి కాల్చి చంపారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని ఈ రోజు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితులు నిజాన్ని ఒప్పుకున్నారు. తాము పాపులర్ కవడానికే అతిక్ అహ్మద్, అష్రఫ్‌ హత్య చేసినట్లు పోలీసులు కస్టడీలో చెప్పారు. ఇందుకోసం వారు గత కొంతకాలంగా స్థానిక జర్నలిస్టుల మధ్య జీవిస్తున్నట్లు తెలిపారు. అలాగే తమ రాష్ట్రంలో అతిక్-అష్రఫ్ గ్యాంగ్‌ను పూర్తిగా తుడిచిపెట్టాలని తాము కోరుకుంటున్నామని, నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story