బీహార్లో ఘోర ప్రమాదం.. గోడ కూలి 40 మందికి తీవ్ర గాయాలు

by M.Rajitha |
బీహార్లో ఘోర ప్రమాదం.. గోడ కూలి 40 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ రాజధాని పాట్నాలోని పుంపున్ దగ్గర్లోని శ్రీపాల్ పూర్ గ్రామంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ మత పరమైన సభలో పాల్గొన్న 100 మంది మీద పురాతన గోడ కూలిన ఘటనలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీపాల్ పూర్ గ్రామంలో ప్రతి బుధవారం, ఆదివారం మత పరమైన సమావేశాలు జరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం గ్రామానికి చెందిన రాందయాళ్ ప్రసాద్ ఇంట్లో సమావేశం జరుగుతుండగా.. పక్కనే ఉన్న ఓ పురాతన గోడ అకస్మాత్తుగా కూలి, గోడ పక్కనే కూర్చున్న వారి మీద పడింది. దాదాపు 40 మంది గోడ శిథిలాల కింద చిక్కుకుపోగా.. స్థానికులు వారందరినీ వెలికి తీసి, హుటాహుటిన పాట్నా మెడికల్ కాలేజీకి తరలించారు. కాగా గాయపడిన వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పుంపున్ డిఎస్పీ పల్లవి కుమారి తెలిపారు. అలాగే క్షతగాత్రుల్లో అధికంగా మహిళలు, పిల్లలు ఉన్నారని వివరించారు.

Next Story

Most Viewed