- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జేఎన్యూలో సీతారాం ఏచూరికి ఘన నివాళి
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తీవ్ర అనారోగ్యంతో మరణించిన జాతీయ సీపీఐ(ఎం)(CPIM) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitharam Yechury)కి జేఎన్యూ(JNU) విద్యార్థులు ఘన నివాళులర్పించారు. మొదట ఎయిమ్స్(AIMS) ఆసుపత్రిలో పలువురు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలు ఏచూరి భౌతికకాయం మీద ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం ఎయిమ్స్ ఆసుపత్రి నుండి జేఎన్యూకు తరలించారు. జేఎన్యూఎస్యూ ఆఫీసు వద్ద సీతారాం పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఉంచగా.. వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు, పలు విద్యార్థి సంఘాల నేతలు లాల్ సలాం కామ్రేడ్ అంటూ నినాదాలు చేస్తూ.. కన్నీటి అంజలి ఘటించారు. ఆ తర్వాత అక్కడి నుండి సీతారాం పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకు వెళ్లారు. అక్కడి నుండి ఏచూరి భౌతిక దేహాన్ని శనివారం సాయంత్రం ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు.
Advertisement
Next Story