మీడియా సమావేశంలోనే గుండెపోటుతో మరణించిన యువనేత

by M.Rajitha |
మీడియా సమావేశంలోనే గుండెపోటుతో మరణించిన యువనేత
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నేత గుండెపోటుకు గురై మరణించారు. వివరాల్లోకి వెళితే.. ముడా కుంభకోణం వివాదంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద పలు అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సిద్దరామయ్య మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు బెంగుళూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యి, అక్కడిక్కడే కుప్పకూలి పోయారు. పక్కనే ఉన్న తోటి నాయకులు వెంటనే సపర్యాలు చేసి, ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే రవిచంద్రన్ మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. మరణం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టం అంటూ పలువురు ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed