రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే

by Y. Venkata Narasimha Reddy |
రైలు ప్రారంభిస్తుండగా పట్టాల మీద పడిపోయిన ఎమ్మెల్యే
X

దిశ వెబె డెస్క్ : కొత్త రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనూహ్యంగా అదే రైలు పట్టాల మీద పడిపోయిన ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఉత్తర ప్రదేశ్ లోని ఇటావాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రమాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఢిల్లీలో ఆగ్రా - బనారస్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఇటావా జంక్షన్ లో బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా ప్రారంభించారు. ప్రారంభోత్సవ సమయంలో జనం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఫాట్‌ఫామ్ పైకి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. కొత్త రైలును జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సరితా భదౌరియా ప్లాట్ ఫామ్ మీద నుంచి పట్టాలపై పడిపోయారు. వెంటనే తేరుకున్న కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఎమ్మెల్యేను పట్టాలపై నుంచి పైకి లాగారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ఫాట్‌ఫామ్ మీద నిలుచున్న ఎమ్మెల్యే స‌రితా .. త‌న చేతుల్లో ఉన్న పచ్చజెండాను ఊపారు.

Advertisement

Next Story

Most Viewed