ఏఐ వాయిస్‌తో బురిడి కొట్టించిన లేడీ..! మగ గొంతుతో బెదిరించి 6 లక్షలు దోపిడీ

by Ramesh Goud |
ఏఐ వాయిస్‌తో బురిడి కొట్టించిన లేడీ..! మగ గొంతుతో బెదిరించి 6 లక్షలు దోపిడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ లేడీ ఏఐ సాంకేతికతతో వాయిస్ మార్చి ఎదురింటి యువతిని బురిడీ కొట్టించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. బెదిరింపులకు పాల్పడి ఆ యువతి నుంచి ఏకంగా 6 లక్షల రూపాయలను కాజేసింది. కృత్రిమ మేధస్సు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో.. అంతకన్నా ఎక్కువ నష్టాలు కూడా ఉంటాయని టెక్నాలజీ నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి ఘటనలు వింటుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. థానే జిల్లాకు చెందిన ఓ మహిళ టెక్నాలజీని ఉపయోగించి భారీ మోసానికి పాల్పడింది. కృత్రిమ మేధ సహాయంతో పురుషుడిలా తన పొరుగింటి యువతికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసింది.

ఆమెను మానసికంగా ఇబ్బందుల పాలు చేసి బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేసింది. ఇలా పలు మార్లు చేసి ఏకంగా ఆరు లక్షలకు పైగా దోపిడి చేసింది. వేదింపులకు విసిగిపోయిన బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి ఈ ఘరానా మోసాన్ని బయటపెట్టారు. తన పొరుగింటి మహిళే ఇదంతా చేసిందని తెలియడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, శనివారం ఆ లేడీ కిలాడీని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed